పాకిస్థాన్​లో క్రికెట్ ఆడలేం.. శ్రీలంక ప్లేయర్స్!

Tuesday, September 10, 2019 06:48 AM Sports
పాకిస్థాన్​లో క్రికెట్ ఆడలేం.. శ్రీలంక ప్లేయర్స్!

శ్రీలంక: ఖరారైన షెడ్యూల్ ప్రకారం శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరగాల్సి ఉంది, అయితే పాకిస్థాన్​ టూర్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియాకు తెలిపింది. ఈ నెలలో లంక టీం పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించటంతో సిరీస్ నుండి శ్రీలంక తప్పుకుంది. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగాళ్లు పాక్​లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ జాబితాలో లంక జట్టు మాజీ సారథులు ఆంజెలో మ్యాథ్యూస్, తిసారా పెరీరా కూడా ఉన్నారు.

సెప్టెంబర్ 27 నుంచి సిరీస్ లో భాగంగా పాకిస్థాన్​లో ఆరు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అక్టోబర్​ 9 వరకు కొనసాగే ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ 20లు ఉన్నాయి. 2009లో శ్రీలంక క్రికెటర్ల వాహనాలపై ఉగ్రదాడి అనంతరం పాక్​లో అంతర్జాతీయ మ్యాచ్​ ఆడేందుకు ఏ దేశం ముందుకి రావటంలేదు. అప్పటి నుంచి యూఏఈ కేంద్రంగా పాకిస్థాన్ ఇతర దేశాలతో మ్యాచ్​లు ఆడుతుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: