కోర్టు నోటీసులతో వణికిపోతున్న బుద్దా, ఉమా, కారణం పిన్నెల్లి..!

Tuesday, March 17, 2020 09:07 AM Politics
కోర్టు నోటీసులతో వణికిపోతున్న బుద్దా, ఉమా, కారణం పిన్నెల్లి..!

మాచర్లలో జరిగిన ఘటన ఇప్పుడు మరో టర్న్ తీసుకుంటోంది. ఈ నెల 11న మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిషోర్‌లపై జరిగిన దాడిపై విచారణ కోసం టీడీపీ నేతలిద్దరినీ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయంగానూ అధికార పార్టీ పైన విమర్శలకు కారణమైంది. పోలీసు శాఖ సైతం దీని మీద ఫోకస్ చేసింది. అయితే, తాము ఈ విచారణకు హాజరు కాబోమని,తమను హతమార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

For All Tech Queries Please Click Here..!