టీడీపీలో కొత్త జోష్.. వైసీపీ సెల్ఫ్ గోల్ఫ్: సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త సీన్
Wednesday, March 18, 2020 03:27 PM Politics
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్లుగా మారింది. ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకూ వరుసగా తప్పు బడుతూ రమేష్ కుమార్ పైన విరుచకుపడ్డారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిర్ణయం జరిగిందంటూ ఆరోపించారు. అయితే, దీని పైన సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి అక్కడా చుక్కెదురైంది. ఇక, ఇప్పుడు దీనిని టీడీపీ తమ అనుకూల అస్త్రంగా మలచుకొని అధికార పార్టీ మీద ఎక్కుపెడుతోంది. వైసీపీ సైతం ఎన్నికల సంఘం నిర్ణయం మీద అవసరానికి మించి స్పందించి.
For All Tech Queries Please Click Here..!