Vallabhaneni Vamsi: టీడీపీ జాతీయ పార్టీనా.. వల్లభనేని వంశీ సెటైర్

Tuesday, February 9, 2021 03:15 PM Politics
Vallabhaneni Vamsi: టీడీపీ జాతీయ పార్టీనా.. వల్లభనేని వంశీ సెటైర్

Amaravati, Dec 19: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఆయన తనయుడు లోకేష్‌పై వల్లభనేని వంశీ మండిపడ్డారు. టీడీపీ జాతీయ పార్టీ అని ఎవరు ప్రకటించారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ జాతీయ నాయకులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. చంద్రబాబు పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 

ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. రాజధాని ఎక్కడ పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని వల్లభనేని వంశీ అన్నారు. జాతీయ పార్టీ అంటే నాలుగు రాష్ట్రాల్లో సీట్లు ఉండాలని... కనీసం ఒక రాష్ట్రంలో కూడా సరిగా సీట్లు లేని టీడీపీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ విచారణ జరిపించి ఎలుకను పట్టుకోలేకపోయారని చంద్రబాబు అంటున్నారని... ఎలుకలు పట్టారా? పందికొక్కులను పట్టారా? అనే విషయం త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. పేదలకి ఇళ్లస్ధలాలు ఇవ్వకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలోంచి అమరావతి రైతులు బయటకి రావాలని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 70 రోజులకి పైగా ఇళ్ల స్ధలాల కోసం దళితులు దీక్షలు చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మందడం దీక్ష శిబిరంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..'మీరు అమరావతి ఉద్యమం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చినట్లు  ఇక్కడెవరూ పెయిడ్ ఆర్టిస్ట్‌లు లేరు. మీరు...మీ తోకపార్టీలు పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారు' అని  దుయ్యబట్టారు.

చంద్రబాబుకి మేనేజ్‌ చేయడం పుట్టుకతో వచ్చిన విద్య అని పేర్కొన్న మంత్రి..చంద్రబాబు‌ బినామీలు, బినామీ ఆస్తులు అమరావతిలోనే ఉన్నాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో 9 రాజధానులు కట్టడానికి గతంలో చంద్రబాబు ప్లాన్ చేసి..ఇక్కడ పేదలు నివాసం ఉండకూడదని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతంలో లేని ఇబ్బందులు ఈ అమరావతిలోనే ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. 

అమరావతిలో రాజధాని తీసేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎక్కడా చెప్పలేదు. ఈ ప్రాంతంలో సెక్రటేరియట్...హైకోర్టు మాత్రమే ఉండవు. మిగిలిన అన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు యధావిధిగా ఉంటాయి. కార్యనిర్వహక రాజధాని ఉత్తరాంధ్రలో ఉంటే తప్పేంటి? సిట్ అమరావతి కుంభకోణంపై కేసు నమోదు చేస్తే రాత్రికి రాత్రి చంద్రబాబు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇలాంటి ఆర్డర్ చంద్రబాబు తప్పితే ప్రధాని‌ కూడా తీసుకురాలేరు.  2 వేల కోట్లతో ఈ ప్రాంతంలో  జాతీయ రహదారులని అభివృద్ది చేయనున్నారు. మూడు రాజధానులు పెట్టి తీరతాం...విశాఖలో కార్యనిర్వాక రాజధాని...అమరావతిలో శాసన సభ...కర్నూలులో హైకోర్టు పెట్టి తీరతామని.. సిఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకి ఇళ్ల  స్ధలాలు ఇవ్వబోతున్నారని కొడాలి నాని తెలిపారు

For All Tech Queries Please Click Here..!