మొన్న మద్యం అమ్మకాలు, నిన్న గ్యాస్ వివాదం, ఈరోజు జగన్ సర్కార్‌పై టీడీపీ మరో లేటెస్ట్ వెపన్

Tuesday, May 12, 2020 12:08 PM Politics
మొన్న మద్యం అమ్మకాలు, నిన్న గ్యాస్ వివాదం, ఈరోజు జగన్ సర్కార్‌పై టీడీపీ మరో లేటెస్ట్ వెపన్

అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం వరుసబెట్టి దాడులను కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అధికార పార్టీ నాయకులను ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒకదాని తరువాత మరొక ఆరోపణాస్త్రాలను సంధిచి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది. వివరణలను ఇచ్చుకునే ప్రయత్నం చేయడం తప్ప ఎదురుదాడికి దిగలేని పరిస్థితిని వైసీపీ ప్రభుత్వానిది అయ్యేలాగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. టీడీపీ తాజాగా లేవనెత్తిన మరో సామాజిక అంశానికి ప్రభుత్వం మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.

తెలుగుదేశం పార్టీ సరికొత్త అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. అదే కోరింగ మడ అడవులు. తూర్పు గోదావరి రక్షణ కవచంలా నిలిచిన కోరింగ మడ అడవులను అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన తాజాగా వెపన్‌లా మార్చుకుంది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికి జగన్ సర్కార్.. ప్రకృతి ప్రసాదించిన కోరింగ మడ అడవులను సైతం ధ్వంసం చేయడానికి వెనుకాడట్లేదని ఆరోపిస్తోంది. దట్టమైన చెట్లతో నిండిన ఓ ఫొటో, పేదలకు ఇళ్ల పట్టాల కోసం దాన్ని నరికి వేశారంటూ మరో ఫొటోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: