అమరావతి కోసం రాజీనామా చేయనున్న టీడీపీ ఎమ్మెల్యేలు.

Thursday, January 9, 2020 01:06 PM Politics
అమరావతి కోసం రాజీనామా చేయనున్న టీడీపీ ఎమ్మెల్యేలు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటే పార్టీకి తీరని నష్టం తప్పదు. దీనికి ప్రధాన కారణం ఏపీలో రాజధాని సమస్య అనేది ఇప్పుడు ఆ మూడు ప్రాంతాలకు చెందిన సమస్యగా ముందుకు వెళుతుందే కాని ఎక్కడా రాజధాని సమస్యగా అది వెళ్ళడం లేదు. ఇక టీడీపీలో రాజధాని సమస్యపై ఇప్పటికే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు, రాయల సీమ నేతలు పార్టీకి భిన్నంగా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు.

రాజీనామాల ద్వారా ఏపీ సీఎం వైయస్ జగన్ కు నష్టం వస్తుందని అనుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది..పైగా అది సీఎం జగన్ కే ప్లస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మంకగా తీసుకుంటుందో గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూమా ఫ్యామిలీ మధ్య జరిగిన ఎన్నికలే ఉదాహరణ. టీడీపీ నేతలంతా రాజీనామా చేస్తారా అన్నది సందేహమే. ఒక వేళ చేసినా మళ్ళీ ఆ సీట్లు అన్నీ గెలుస్తారా అనేది ఇంకా సందేహమే. రాజీనామాల ఆమోదం స్పీకర్ చేతిలో ఉంటుంది కాబట్టి ప్రాసెస్ వెను వెంటనే జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎటుచూసినా నష్టపోయేది టీడీపీ పార్టీనే కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తే మంచిదేమో.

For All Tech Queries Please Click Here..!
Topics: