టీడీపీ అభ్యర్థుల్లో బాధ ఇదేనట!

Tuesday, April 23, 2019 07:04 AM Politics
టీడీపీ అభ్యర్థుల్లో బాధ ఇదేనట!

నిన్న జరిగిన టీడీపీ పార్టీ మీటింగ్ ను సంతాప తీర్మానాలు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడుతున్న మాటలు, చేపడుతున్న చర్చలు, చేస్తున్న ఆరోపణల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఇలా వ్యంగ్యంగా స్పందించారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర  వ్యాప్తంగా నిర్వహించిన మీటింగ్ కూడా నిరుచ్చాహంగా సాగిందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరుపై చంద్రబాబు నాయుడు ఈ సమీక్షను నిర్వహించారు. 

ఈ సమావేశంలో నేతలు అంత యాక్టివ్ గా కనిపించలేదు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోతుందని పోలింగ్ ముందు నుంచే చాలా సర్వేలు చెబుతూ ఉన్నాయి. జాతీయ మీడియా సర్వేలు కూడా అదే మాటే చెప్పాయి. అయితే టీడీపీ అనుకూల మీడియా ఎన్నికల ముందు పార్టీ నేతల కాన్ఫిడెన్స్ ను కాపాడుకొంటూ వచ్చింది. అయితే పోలింగ్ పూర్తి అయ్యాకా టీడీపీ అనుకూల మీడియా వర్గాలు కూడా మునుపటిలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేయలేకపోతూ ఉన్నాయి. ఇక చంద్రబాబు ఈవీఎంల మీద బాబు నెపాన్ని నెడుతూ ఉన్నారు, ఈసీని తిడుతూ ఉన్నారు. ఫలితంగా టీడీపీ ఓటమి ఖరారే అనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతూ ఉంది. 'చంద్రబాబు నాయుడు తను భయపడుతూ మనల్నీ  భయపెడుతున్నారు' అని సమీక్ష సమావేశంలో కొందరు నేతలు వ్యాఖ్యానించారట.

For All Tech Queries Please Click Here..!