సీఎం వైఎస్ జగన్కు అరుణాచల్ సీఎం ధన్యవాదాలు, దేశానికే మార్గదర్శకంగా విజయవాడ

Saturday, March 28, 2020 08:04 AM Politics
సీఎం వైఎస్ జగన్కు అరుణాచల్ సీఎం ధన్యవాదాలు, దేశానికే మార్గదర్శకంగా విజయవాడ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో చిక్కుకుపోయిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పౌరులు కి ఫోన్ చేసిన వెంటనే సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తక్షణం స్పందించి చర్యలు చేపట్టారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. కోవిడ్-19 వంటి సంక్షోభ సమ యంలో పోరాడటానికి ఇటువంటి సహకారం మరింత దోహదప డుతుంది అని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణపై తమిళ మీడియాలో ప్రశంసల జల్లు కరోనాని  నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తమిశ మాధ్యమాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ వల్ల విదేశాల నుంచి వచ్చే వారి వివరాలతోపాటు వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తు లను సులువుగా గుర్తించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కూర గాయల కొనుగోలులో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చేసిన ఏర్పాట్లపై దినమలర్ తమిళ దినపత్రిక శుక్రవారం నాటి సంచికలో దేశానికే మార్గదర్శకంగా విజయవాడ అనే శీర్షికతో మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది.

For All Tech Queries Please Click Here..!
Topics: