నేటి సాయంత్రం సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు!

Wednesday, August 7, 2019 07:46 AM Politics
నేటి సాయంత్రం సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు!

బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సుస్మాస్వరాజ్ మంగళవారం రాత్రి కన్ను మూశారు. గుండెనోప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హూటిహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుస్మాస్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు.

ఇక ఎయిమ్స్ నుంచి ఆమె పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇవాళ మధ్యాహ్నం 11 గంటల వరకు ఇంటి వద్దనే ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె భౌతిక కాయాన్ని ఉంచనున్నట్టు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక లాంఛనాలతో లోదీ రోడ్డులోని స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: