టీడీపీ, జనసేన ఏపీకి 3 రాజధానులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే?

Friday, December 20, 2019 05:51 PM Politics
టీడీపీ, జనసేన ఏపీకి 3 రాజధానులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే?

అమరావతి అనేది కేవలం చంద్రబాబు సామాజికవర్గాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా బలపరచడానికి మాత్రమే ఉద్దేశించిన రాజధాని. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దొనకొండ ప్రాంతాన్ని రాజధాని గా ప్రకటించి ఉండేవారు. తమ సామాజికవర్గం వారు బలపడితే తన అధికారం శాశ్వతంగా ఉంటుందని చిత్తభ్రమకు లోనై అమరావతిలో రైతులనుంచి దౌర్జన్యంగా భూములను లాక్కున్నారు. తమ బినామీలు భూములను కొన్నచోట లాండ్ పూలింగ్ నుంచి లాఘవంగా తప్పించారు. భూవ్యాపారం చేసే ఉద్దేశ్యం లేకపోతె నాలుగువేల ఎకరాల భూమిని చంద్రబాబు, ఆయన ముఠా ఎందుకు కొనుగోలు చేసేవారో ఆలోచించండి,.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశ్యంతోనే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని అర్ధం చేసుకోండి. ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన విశాఖలో పాలనారాజధానిని ఏర్పాటు చెయ్యడం ద్వారా మళ్ళీ ప్రత్యేకంగా రాజధానిని నిర్మించి లక్షలకోట్ల రూపాయలు దుబారా చేసే ప్రమాదాన్ని జగన్ సమర్ధవంతంగా నివారించారు. తమ భూములు తమకు తిరిగొస్తే నిజమైన రైతు సంతోషిస్తాడు. కానీ, తెలుగుదేశం, జనసేన కలిసి జగన్ మీద కుట్రపూరితంగా పెయిడ్ ఆర్టిస్టులకు రైతుల వేషాలు వేసి డ్రామాలు ఆడిస్తున్నారు. తెలుగుదేశంలోని ప్రముఖ నాయకులు గంటా శ్రీనివాస రావు, కొండ్రు మురళి కూడా విశాఖలో రాజధానిని ఆహ్వానిస్తున్నారు. హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చెయ్యడం ద్వారా అరవై సంవత్సరాల తమ కోరిక తీరుతున్నందుకు సంతోషిస్తున్నారు. జగన్మోహనుడి కి జేజేలు పలుకుతున్నారు.( రామ భాస్కర్ దేవరకొండ )

For All Tech Queries Please Click Here..!
Topics: