నేడే పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు (24-జులై-2019) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విభాగాలకు కమిటీలు నియమించారు. ఈ కమిటీల వివరాలను ఇవాళ విజయవాడలో ప్రకటించబోతున్నారు పవన్ కల్యాణ్. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన ఆయన క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు రూపమిచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాడవాడలా జనసేన జెండా రెపరెపలాడేలా పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్టు తెలిసింది. ఇవాళ ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉండనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో షాక్ తిన్న జనసేన పార్టీని బలోపేతం చేయడంపై జనసేనాని దృష్టిసారించారు