మళ్ళీ అదే పల్లవి అందుకున్న మోదీ.

Thursday, January 30, 2020 10:00 AM Politics
మళ్ళీ అదే పల్లవి అందుకున్న మోదీ.

ఢిల్లీ ఎలెక్షన్స్ దృష్ట్యా ప్రధాని మోదీ మళ్ళీ భారత్ పాక్ యుద్ధం అని పాత పాటనే పాడుతున్నారు. "యుద్ధం వస్తే 10-12 రోజుల్లో పాకిస్తాన్ ఫినిష్ అని అన్నారు" ఇంతక ముందు ప్రతి ఎన్నికకు ముందు ఇలాంటి ఎదో ఒక రెచ్చగొట్టే వ్యాఖ్య చేసిన మోడీ ఇప్పుడు కూడా అదే అస్త్రం ఎంచుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు అని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలలో ప్రచారం చేసుకోవడానికి చెప్పుకోవడానికి మోడీ చేసిన అభివృద్ధి ఏమి లేదు కాబట్టే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.

కానీ ఇలాంటి రెచ్చగొట్టే అంశాలు అన్ని వేళలలో అన్ని రాష్ట్రాలలో పని చేయవు జనాలు ఈడ్చి బండకు కొడతారు అని ఇటీవల వరుసగా ఇన్ని రాష్ట్రాలలో ఓడినా కూడా ఇంకా మాన్య మోదీ అండ్ టీం కి అర్థము అవ్వకపోవడం గమనార్హం. భారత ఆర్మ్ చీఫ్ కూడా త్వరలో యుద్ధానికి సిద్దమ్ అనే స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు.

For All Tech Queries Please Click Here..!
Topics: