కుప్పకూలిన భ్రమల రాజధాని..!

Monday, January 6, 2020 08:14 AM Politics
కుప్పకూలిన భ్రమల రాజధాని..!

రాజధాని మార్పు గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా ,మనమూ రెండు మాటలు చెప్పుకుందాం. అసలు మన రాష్ట్రం ఎంత? ఆదాయం ఎంత? ప్రజల కనీస అవసరాలేమిటి? రాజధాని నిర్మాణం అంటే ఏమిటి ఇలాంటి ప్రశ్నలన్నీ వదిలేసి అమరావతి అనే బాబుగారి భ్రమల కట్టడం పై ప్రజలందరి దృష్టి పడేలా అప్పటి ప్రభుత్వం,మీడియా చాలా జిమ్మిక్కులే చేసింది. సింగపూర్,కజకిస్తాన్,జపాన్,జర్మనీ ,దుబాయ్. ఇలా ఒకటేమిటి ప్రపంచమంతా గుడ్లప్పగించి చూసే రాజధాని, ప్రపంచం ఉలిక్కిపడే రాజధాని అంటూ ప్రజల్ని భ్రమల్లో పెట్టారు,పాలన గురించి గాలికి వదిలేసి CM దేశాలు పట్టుకొని తిరిగాడు. లక్షల కోట్లు కావాలంటూ కేంద్రాన్ని బెదిరించారు. ఎవరైనా ఆకలి అంటే అన్నం పెడతారు కాని,తోటరాముడికి లాగా రాజ్యాన్ని,యువరాణి ని ఇమ్మంటే ఇస్తారా? కేంద్రం పిచ్చోడిని చూసినట్లు చూసి చీదరించుకుంది. ప్రజలు బాబు భ్రమల్లో పడకుండా సరైన బుద్ది చెప్పారు.

ఇప్పుడు ఒక జాతి నుండి కాక ప్రజలనుండి పాలకుడు వచ్చాడు.అన్ని ప్రాంతాల అభివృద్ధి అతడి బాధ్యత. ఒక వర్గం కోసమే రాజధాని పేరుతో రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిన మాఫియా వెన్ను విరిచేలా రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ కట్టింది 5 బిల్డింగ్ లు అంతే.తరలించేది ఆఫీస్ లను.తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే. అంతకంటే అక్కడ కట్టింది ఏమీలేదు,ప్రజలు కొత్తగా వెళ్లిందీ ఏమీ లేదు.
ఆ గ్రామాలూ అలాగే వుంటాయి .ఆ ప్రజలూ అక్కడే వుంటారు. కర్నూల్ నుండి రాజధాని తరలిస్తే కర్నూల్ మాయమైపోలేదు.అలాగే అమరావతి కూడా మాయమై పోదు.రాష్ట్ర ప్రజల రక్తమాంసాలను పీల్చేద్దామనుకున్న రియల్టర్లకు తప్ప ఎవరికీ ఏ నష్టమూ లేదు.

రాజధాని అంటే అన్ని కులాలు,మతాలు,ప్రాంతాలవారికి అనువుగా వుండి,రోడ్,రవాణాసౌకర్యాలు,స్కూల్స్ ,హాస్పిటల్స్ అందుబాటులో వుండటం లాంటివి వుండాలి.అవన్నీ వైజాగ్ లో వున్నాయి కాబట్టే అదే సరైన ప్లేస్ అనుకున్నారు. ఈ అమరావతి అనే తెల్ల ఏనుగు ని మేపడం అనే భారాన్ని రాష్ట్ర నెత్తిమీద నుండి తీసేసి ముఖ్యమంత్రి జగన్ గారు ఈ రాష్ట్రాన్ని ,రేపటి తరాలను కూడా కాపాడారు.

ఇలా ఒక్కసారిగా కలలు కుప్పకూలడం బాధగానే వుండి పిచ్చి ప్రేలాపనలు చేయచ్చు.వాటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోక పోవచ్చు. ఎవడో చెప్పిన చెప్పుడు మాటలు విని అమ్మాయిని ఏ తాగుబోతుకో ఇచ్చి అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసిన తండ్రి,వాడి అసలు స్వరూపం తెలిశాక ,డబ్బు కర్చుపెట్టాం కదా అని వాడికే ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాశనం చెయ్యడు,ఇంకో మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేస్తాడు. అదే జగన్ చేశాడు,చేస్తున్నాడు.

For All Tech Queries Please Click Here..!
Topics: