నిమ్మగడ్డ కేసు పైన దూకుడు పెంచిన సీఐడీ.

Sunday, May 3, 2020 01:41 PM Politics
నిమ్మగడ్డ కేసు పైన దూకుడు పెంచిన సీఐడీ.

నిమ్మగడ్డ అదనపు పీఎస్‌గా పనిచేసిన సాంబమూర్తి నుంచి విస్తుపోయే నిజాలు, రమేష్‌ కుమార్‌ పీఎస్‌ సాంబమూర్తిని విచారిస్తోన్న సీఐడీ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ వెనుక ఉన్న లెక్కను తేల్చే పనిలో సీఐడీ దూకుడు పెంచింది.  రమేష్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను ఎవరో నిమ్మగడ్డకు మెయిల్ ద్వారా పంపినట్టు సీఐడీ గుర్తించింది.  దీంతో లేఖను తయారు చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ కోసం సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ కోణంలోనే కేసును దర్యాప్తు చేసి.. మరికొన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రమేష్‌ కుమార్‌ను సైతం సీఐడీ విచారించే అవకాశం ఉంది. అయితే ఆదివారం నాటి విచారణలో పీఎస్‌ సాంబమూర్తి పలు విషయాలను వెల్లడించారు. నిమ్మగడ్డ పంపిన లేఖను డౌన్ లోడ్ చేసుకుని కేంద్రానికి పంపినట్లు పీఎస్ వాంగ్మూలం ఇచ్చారు. లేఖ విషయంలో సీఐడీ ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం.  

కాగా నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇటీవల డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంబమూర్తిని కొద్ది రోజుల క్రితం విచారించింది. నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసిన  లేఖ విషయంలో సాంబమూర్తి పొంతన లేని సమాధానాలు చెప్పడంతోపాటు లేఖకు సంబంధించిన అనేక ఆధారాలను నాశనం చేయడం పట్ల సీఐడీ అనుమానాలు వ్యక్తం చేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: