పాపం పండుతుంది, పీఏ డైరీలో చంద్రబాబు పాపాల చిట్టా !

Tuesday, February 11, 2020 02:17 PM Politics
పాపం పండుతుంది, పీఏ డైరీలో చంద్రబాబు పాపాల చిట్టా !

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ వ్యతిరేక పార్టీలకి నిధులు సమకూర్చింది మన బాబు గారే అన్న నిజాలు బయటపడుతున్నాయి. మొన్న 2019 లో దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలకి వేలకోట్లు పంపాడు. ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకపోతే చంద్రబాబు ప్రధాని కావాలనే ఉద్దేశ్యంతోనే దాదాపుగా దేశవ్యాప్తంగా 40 వేల కోట్లు పంచాడు అని సమాచారం.

2019 కి ముందే వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఏపీ నుండే డబ్బు వెళ్లినట్లు కనుకొన్న కేంద్ర నిఘా వర్గాలు. తెలంగాణా , గుజరాత్ , కర్ణాటక , మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , ఛత్తీస్ఘడ్ , ఉత్తరప్రదేశ్ ఇలా దాదాపుగా గత నాలుగేళ్లలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రానికి బాబుగారే నిధులు సమకూర్చాడు అని సమాచారం. ఇప్పటికైనా అర్థమైందా, 3 లక్షల కోట్లు రాష్ట్రం నెత్తిన అప్పు చేసి రాష్ట్రంలో కనీసం 3 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. కనీసం 50 కోట్లు ఖర్చుపెట్టి పులిచింతలలో పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేదు. మనల్ని తాకట్టు పెట్టి తెచ్చిన 3 లక్షలు కోట్లని ఈ రకంగా దోచుకొని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకి పంచి ప్రధాని కావాలని పెద్ద స్కెచ్ వేసాడు .

For All Tech Queries Please Click Here..!
Topics: