నరేంద్ర మోడీకి జై కొట్టిన చంద్రబాబు

Friday, March 27, 2020 11:48 AM Politics
నరేంద్ర మోడీకి జై కొట్టిన చంద్రబాబు

భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయంలో కితాబులను ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు.

ఇలాంటి కర్ఫ్యూ తరహా వాతావరణాన్ని ఇన్ని రోజుల పాటు కొనసాగించాల్సి రావడం వల్ల పేదలు, దినసరి వేతన కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. అప్పటి దాకా రోజువారీ కూలీల ఉపాధి మాటేమిటనే ప్రశ్న తలెత్తింది.దీనికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకంగా లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్యాకేజీ పట్ల తన స్పందనను వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: