చంద్రబాబు సభలో విషాదం , 7 మంది దుర్మరణం

Wednesday, December 28, 2022 09:29 PM Politics
చంద్రబాబు సభలో విషాదం , 7 మంది దుర్మరణం

చంద్రబాబు సభలో విషాదం , 7 మంది దుర్మరణం పాలయ్యారు. చంద్రబాబు నియోజకవర్గాల సమీక్షల్లో భాగంగా పలు నియోజకవర్గాలలో కార్యకర్తలతో సభలు ఎర్పాటు చేస్తున్నారు. ఈరోజు కందుకూరు లో సభ ఎర్పాటు చేయగా జనం భారీగా వచ్చారు. 

జనం లో తోపులాట జరగటం వలన కొంతమంది పక్కనే వున్న మురికి కాలువలో పడిపోయారు. వారి పైన అక్కడే నిలిపి వున్న ద్విచక్ర వాహనాలు , మరికొంత మంది కార్యకర్తలు పడ్డారు. పోలీసులు కార్యకర్తలు అప్రమత్తం అయ్యి హాస్పిటల్ కి తరలించగా అప్పటికే 7 మంది చనిపోయారు . మరి కొంత మందికి పరిస్తితి విషమంగా ఉంది.

చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి వైద్యం అందిస్తున్నారు. చంద్రబాబు హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన వారిని , చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: