మోడీని ఓడించేదెవరో చెప్పిన ఒవైసీ

Thursday, December 6, 2018 11:51 PM News
మోడీని ఓడించేదెవరో చెప్పిన ఒవైసీ

ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్‌లపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మలక్‌పేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఈ దేశం మీదేనా? నాది కాదా? అని ప్రశ్నించారు. వారి విధానాలను విమర్శిస్తే దేశం నుంచి తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రధాని మోదీ ఆలోచన కాదని, యోగి ఆలోచన అని పేర్కొన్నారు. బీజేపీని ఓడించేందుకు తమకు అల్లా చాలని, తమకు ఆయన అండగా ఉన్నాడని పేర్కొన్నారు. మత రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఒవైసీ ఆరోపించారు. ర్యాలీల్లో అమిత్ షా అయితే తన గురించి లేదంటే ఎంఐఎం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజాముల గురించి మాట్లాడే ముందు చరిత్రను తెలుసుకోవాలని యోగికి సూచించారు. తాము హైదరాబాద్‌ను వదిలి పారిపోబోమని, మోడీ, అమిత్ షా , అరెస్సెస్‌పై పోరాడతామని తేల్చి చెప్పారు.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/ChGrinBQbE0" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>

For All Tech Queries Please Click Here..!