ఏపీ కరోనా కేసుల బులెటిన్ విడుదల

Wednesday, April 29, 2020 01:41 PM News
ఏపీ కరోనా కేసుల బులెటిన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తాజా బులెటిన్‌ను రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన పరీక్షల్లో 73 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసులు 1332 కాగా.. 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 31 మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఎటువంటి కోవిడ్ - 19 మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1014మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కువ కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9.00 గంటల నుంచి ఇవాళ్టి ఉదయం 9.00 గంటల వరకు గుంటూరు జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 283 కాగా, కర్నూల్‌లో 343, కృష్ణా 236, నెల్లూరు 82, చిత్తూరు 77, కడప 69, ప్రకాశం 60, పశ్చిమగోదావరి 56, అనంతపురం 58, తూర్పుగోదావరి 40, విశాఖ 23, శ్రీకాకుళం జిల్లాలో 05 కేసులు నమోదయ్యాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: