నేడే మెగా విలీనం, 6 బ్యాంకులు కనుమరుగు

Wednesday, April 1, 2020 07:37 AM News
నేడే మెగా విలీనం, 6 బ్యాంకులు కనుమరుగు

ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం ఈరోజు(ఏప్రిల్ 1st 2020) నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆరు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. ఈ ఆరు బ్యాంకులలో మన ఆంధ్రాబ్యాంక్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా కరోనాని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికీ విలీన ప్రక్రియను ప్రణాళిక ప్రకారంగానే అమలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత తరుణంలో విలీన ప్రక్రియ అంత సజావుగా జరగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బ్యాంకుల చీఫ్‌లు మాత్రం ఎలాంటి సమస్యలూ ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితులను కూడా సమీక్షించే నిర్ణయం తీసుకున్నాం అని అంటున్నారు.ఉద్యోగులు, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ జి తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే దాకా రుణ మంజూరు తదితర ప్రక్రియల్లో ఎలాంటి మార్పులు లేకుండా యథాప్రకారమే కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాల అనుసంధానికి తమ బ్యాంకు కూడా సర్వ సన్నద్ధంగా ఉందని ఇండియన్‌ బ్యంక్‌ ఎండీ పద్మజా చుండూరు తెలిపారు. విలీనం కాబోయే అలహాబాద్‌ బ్యాంక్‌ కస్టమర్లకు కూడా తమ ఎమర్జెన్సీ రుణ పథకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె వివరించారు. 2020 డిసెంబర్‌ ఆఖరు నాటికి మొత్తం ఐటీ వ్యవస్థ అనుసంధానం పూర్తి కాగలదని చెప్పారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: