పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది.. ఆమె నాటిన మొక్క‌ల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!

Tuesday, February 4, 2020 10:31 AM News
పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది.. ఆమె నాటిన మొక్క‌ల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!

107 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌. మ‌న‌కెవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు మాత్రం సుప‌రిచితురాలు. గొప్ప ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌. సాలుమ‌ర‌ద అంటే చెట్ల వ‌ర‌స అని అర్థం. తిమ్మ‌క్క‌ను మ‌ద‌ర్ ఆఫ్ ట్రీస్‌గా పిలుస్తారు. ఎవ‌రీ తిమ్మ‌క్క‌? క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరు రూర‌ల్ జిల్లా హులిక‌ల్ గ్రామానికి చెందిన సాధార‌ణ మ‌హిళ‌. పుట్టింది, పెరిగింది గుబ్బి ప‌రిధిలోని తుముకూరులో.  పేద‌రికం కార‌ణంగా చ‌దువుకోలేదు. త‌ల్లిదండ్రులు దిన‌స‌రి కూలీలు. ప‌దేళ్ల వ‌య‌సు వ‌చ్చేస‌రికి తిమ్మ‌క్క గొర్రెల‌ను, మేక‌ల‌ను కాసే బాధ్య‌త చేప‌ట్టింది. ఆమెకు చెట్లంటే ప్రాణం. చిన్న‌ప్ప‌టి నుంచి తుముకూరులో చెట్ల‌తో మంచి అనుబంధం ఏర్ప‌రుచుకుంది.

రోజూ అడ‌వి నుంచి ఏదో ఒక చెట్టు ప‌ట్టుకొచ్చి ఇంట్లో నాటేద‌ట‌. అలా ప్ర‌కృతి నేస్తంగా మారిన ఆవిడ త‌న‌లా ఎంద‌రినో ప్ర‌కృతి గురించి ఆలోచింప‌జేసింది. తిమ్మ‌క్క‌కు బికాలు చిక్క‌య్య‌తో పెళ్ల‌యింది. అత‌డు ఏదో ఒక ప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ పేద‌రికం మాత్రం పోలేదు. పెళ్ల‌యి సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా వాళ్ల‌కు పిల్ల‌లు పుట్టలేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. చిన్న‌ప్ప‌ట్నుంచి చెట్లంటే ప్రాణంగా భావించే తిమ్మ‌క్క చెట్ల‌నే పిల్ల‌లుగా పెంచుకోవాల‌నుకుంది. ఊళ్లో చెట్ల‌ను నాటుతూ క‌న్న బిడ్డ‌ల్లా. కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. 384 మ‌ర్రిచెట్లు హులికుల్ నుంచి కుడుర్ వ‌ర‌కు ఉన్న జాతీయ ర‌హ‌దారికి ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీట‌ర్ల మేర 384 మ‌ర్రి చెట్లు పెంచింది తిమ్మ‌క్క‌. ప్ర‌తిరోజూ పొద్దున్న చెట్ల‌కు నీళ్లు పోయ‌డం. పాదులు తీయ‌డం. అక్క‌డే ఉండి వాటిని ప‌రిర‌క్షించ‌డం వారి దిన‌చ‌ర్య‌లో భాగ‌మైంది. ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000 అని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెప్తున్నారు. తిమ్మ‌క్క సేవ‌ల‌ను గుర్తించిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆమెను ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌గా ప్ర‌క‌టించింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌, ఆక్లాండ్‌, కాలిఫోర్నియాలోని ప‌ర్యావ‌ర‌ణ సంస్థ‌ల‌కు ఆమె పేరు మీద తిమ్మ‌క్కాస్ రీసోర్సెస్ ఫ‌ర్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఎడ్యుకేష‌న్ అని పేరు పెట్టారు. సీబీఎస్ఈ పాఠ్య పుస్త‌కాల్లో ఆమె గురించి పాఠాన్ని పొందుప‌ర్చారు. ప‌ర్య‌వర‌ణ సంర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న తిమ్మ‌క్క కోట్లాది రూపాయ‌ల సంప‌ద‌నైతే స‌మాజానికి ఇచ్చింది కానీ. ఆమె మాత్రం ప్ర‌భుత్వం ఇచ్చే రూ.500 పింఛ‌న్‌తోనే పూట గ‌డుపుతోంది. పర్యావ‌ర‌ణ కోసం స‌మాజం కోసం ఆమె చేస్తున్న సేవ‌ల‌ను గుర్తించి భార‌త ప్ర‌భుత్వం ఈసారి ప‌ద్మ అవార్డుల్లో భాగంగా తిమ్మ‌క్క‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించింది. 

For All Tech Queries Please Click Here..!
Topics: