ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ: కీలకంగా చర్చించిన అంశాలివే...
Wednesday, December 26, 2018 10:47 PM News
టీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నేడు ప్రధాని మోదీతో తొలిసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి మరియు తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వీటితో పాటు మరో 16 కీలక అంశాలను మోదీతో ప్రస్తావించారు. అందులో...
- హైదరాబాదులో ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ఏర్పాటు.
- హైదరాబాదులో ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్
- కరీంనగర్లో ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ఏర్పాటు.
- కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
- వరంగల్లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ది కోసం రూ. 1,000 కోట్లు నిధుల మంజూరు
- జహీరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం నిధులు
- అదిలాబాద్లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్దరణ
- ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
- కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
- సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
- పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.450 కోట్లు గ్రాంట్స్ నిధులు విడుదల
- ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
- కృష్ణా జలాల వివాద పరిష్కారానికి వినతి
- ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి అంశం
- ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన
- ఎస్సీ వర్గీకరణ బిల్లు
For All Tech Queries Please Click Here..!