మహిళను చెప్పుతో కొట్టమన్న టీడీపీ ఎమ్మెల్యే

Friday, January 18, 2019 10:12 PM News
మహిళను చెప్పుతో కొట్టమన్న టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపైన అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఓ మహిళా రైతును ఏకంగా చెప్పుతో కొట్టాలని ఓ అధికార ఎమ్మెల్యే తన అనుచరులను ఆదేశించాడు. అంతే కాకుండా... ఆ మహిళ పైన దాడి చేసిన వారిపైన ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను కూడా ఆదేశించాడు. ఈ వ్యవహారమంతా తెలిసిన పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తనట్లు చోద్యం చూస్తూ ఉండిపోయారు.

ఇకపైన ఇలా ఎవరైనా భూసేకరణకు ఎదురుతిరిగితే ఇలాగె దాడులు చేయిస్తానని ఆ ఎమ్మెల్యే ప్రజలను బయపెడుతున్నాడు. ఈ తతంగమంతా నీతివంతమైన పాలన అందిస్తున్నామని విర్రవీగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటలా ఉన్న అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వరదాపురం సూరి తన అనుచరులను ఆ మహిళ మీద దాడులకు పురమాయించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే  తీరుపై ఓట్లేసి గెలిపించిన మమ్మల్ని ఇలా చెప్పులతో దాడి చేయిస్తారా అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ సంఘటన మీద అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.

For All Tech Queries Please Click Here..!