అమృతతో పనేంటి? కత్తి మహేష్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది!

Thursday, January 31, 2019 05:47 PM News
అమృతతో పనేంటి? కత్తి మహేష్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది!

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పరువు హత్యల్లో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య ఒకటి. అమృత తండ్రి కిరాతకానికి ప్రణయ్ బలయ్యాడు. కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన ప్రణయ్ దగ్గరే ఉంటానని, అతడితోనే తన జీవితం అని తెగేసి చెప్పడంతో అది నచ్చని అమృత తండ్రి సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను చంపించాడు. ప్రణయ్ చనిపోయినపుడు అమృత గర్భవతి.

అయితే, అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అత్తమామల సంరక్షణలో ఉంది. ఇదిలా ఉండగా... హైదారాబాద్‌లోని ప్రయివేట్ ఆసుపత్రిలో ప్రసవించిన అమృతను చూసేందుకు కత్తి మహేష్ మరియు పలు మహిళా సంఘాల నేతలు ఆసుపత్రి వద్దకు వచ్చారు. అయితే, ఆసుపత్రి వర్గాలు వారిని లోపలికి అనుమతించకపోవడంతో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా అమృతను చూసేందుకు వచ్చిన ఎవ్వరినీ సెక్యురిటీ సిబ్బంది అనుమతించలేదు.

For All Tech Queries Please Click Here..!