పెనుగొండను రెడ్జోన్గా ప్రకటించిన అధికారులు..
Wednesday, April 1, 2020 12:01 PM News
పెనుగొండలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పెనుగొండను రెడ్జోన్గా ప్రకటించారు. దీంతో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు బుధవారం పెనుగొండలో ప్రభుత్వ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెనుగొండ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్వీయ గృహ నిర్బంధం పాటించాలని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి , ఇప్పటికి 68 కేసులు నమోదు కాగా గత రెండు రోజుల్లో 44 కేసులు నమోదయ్యాయి.
For All Tech Queries Please Click Here..!
Topics: