పేటియం యూజర్లకు గుడ్ న్యూస్: రూ.7500 క్యాష్ బ్యాక్!

Saturday, January 19, 2019 03:32 PM News
పేటియం యూజర్లకు గుడ్ న్యూస్: రూ.7500 క్యాష్ బ్యాక్!

భారతదేశపు మొబైల్ యాప్ ఆధారిత లావాదేవీలు నిర్వహించే పేటిఎం దిగ్గజం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుని పేటీఎం యాప్ ద్వారా నగదును చెల్లించేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 7500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని పెటీఎంప్రకటించింది. 
రూ.7,500 క్యాష్‌బ్యాక్ పొందేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి

  • పేటీఎం ఎంపిక చేసిన బంక్‌లోనే పెట్రోల్ పోయించుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
  • ఆఫర్‌లో ఉన్న బంక్‌ల పేర్లు తెలుసుకోవడం కోసం పేటీఎం యాప్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
  • కనీసం రూ. 50 పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకున్న వారికే ఈ ఆఫర్ లభిస్తుంది.
  • ఈ ఆఫర్ 2019 ఆగస్టు 1న ముగుస్తుంది.

ఈ ఆఫర్ ఎలా పొందాలి?

  • ఇంధనం పోయించుకున్న తర్వాత పేటీఎం యాప్ ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. 
  • తర్వాత వినియోగదారుడికి పేటీఎం నుంచి మెసేజ్ వస్తుంది, మెసేజ్‌పైన క్లిక్ చేస్తే అందులోని లింక్ డైరక్ట్‌గా పేటీఎంలోని క్యాష్ బ్యాక్ ఆఫర్ల విభాగంలో ఓపెన్ అవుతుంది.
  • దీంతో మీరు చేసిన మెుదటి లావాదేవి యాప్ ద్వారా ధృవీకరించబడుతుంది.
  • 48 గంటల్లోపు SMS ద్వారా నమోదు చేసిన నంబర్‌కి ప్రోమో కోడ్లను పొందుతారు. 
  • ఈ ప్రోమో కోడ్‌ను తదుపరి జరిపే లావాదేవికి ఉపయోగించుకోవచ్చు.
  • ఇలా దాదాపు రూ 7500 వర్త్ గల ప్రోమో కోడ్‌లను పొందవచ్చు.
  • పేటీఎం యాప్ ద్వారా చేసే 11వ 21వ 31వ 41వ ట్రాన్సాక్షన్ ద్వారా పుల్ క్యాష్ బ్యాక్‌ వస్తుంది.

For All Tech Queries Please Click Here..!