తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకోండి... ఆ భయం మనకి లేదు...

Tuesday, February 4, 2020 02:04 PM News
తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకోండి... ఆ భయం మనకి లేదు...

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతానికి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం లేదని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూమ్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాం. రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకుల మీద నిరంతర పర్యవేక్షణ ఉంటుంది అని తెలిపారు.

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది, వైరస్ మనకి రాకుండా చర్యలు తీసుకోవాలని జగన్ ఆరోగ్య శాఖకు సూచనలు చేశారు. రాష్ట్రంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయ ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు విస్తృత పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాల వద్ద వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. విదేశీ భక్తులు ఎక్కువగా వచ్చే తిరుపతిలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితుల కఫం, రక్త నమూనాలను పుణె, హైదరాబాద్‌కు పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

For All Tech Queries Please Click Here..!
Topics: