హైదరాబాదీ తొలి కరోనా పేషెంట్‌తో మోడీ ముచ్చట్లు, కరోనా వారియర్‌ అంటూ అభినందన.

Sunday, March 29, 2020 12:37 PM News
హైదరాబాదీ తొలి కరోనా పేషెంట్‌తో మోడీ ముచ్చట్లు, కరోనా వారియర్‌ అంటూ అభినందన.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ఈసారి ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్‌కు చెందిన తొలి కరోనా వైరస్ పేషెంట్ రామ్‌గంప తేజతో మాట్లాడారు. ఆయనను కరోనా వారియర్‌గా అభివర్ణించారు మోడీ. కరోనా వైరస్ బారిన పడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన తేజ.. పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ.. తేజకు అందించిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్దిసేపటి తరువాత నరేంద్ర మోడీ.. తేజకు ఫోన్ చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: