BREAKING: ప్రజలారా నన్ను క్షమించండి, అందర్నీ క్షమాపణ కోరిన మోదీ..!

Sunday, March 29, 2020 01:22 PM News
BREAKING: ప్రజలారా నన్ను క్షమించండి, అందర్నీ క్షమాపణ కోరిన మోదీ..!

దేశంలో చిన్నా, పెద్దా అందరికీ ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు. 21 రోజులపాటు దేశాన్ని లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయం మీ అందరినీ ఎంతగానో బాధించి ఉంటుంది. అందరినీ ఇంతగా ఇబ్బంది పెట్టే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నందుకు నన్ను క్షమించండి, ప్రధాని ఇలాంటి నిర్ణయం ఎందుకు ఎందుకు తీసుకున్నారని మీలో చాలా మంది అనుకుని ఉండొచ్చు. నాపై కోపం కూడా వచ్చుండొచ్చు.

కానీ నేను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అందరికీ స్పష్టం చేయదల్చుకున్నాను. లాక్ డౌన్ ఒక తప్పనిసరి అనివార్య నిర్ణయం. కరోనా మహమ్మారితో యుద్ధం చేయడానికి లాక్ డౌన్ తప్ప మనకు వేరే దారిలేదు. అందుకే నిష్టూరమైనప్పటికీ ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

For All Tech Queries Please Click Here..!
Topics: