ఏపీపీఎస్సీ పై కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫైర్

Monday, November 25, 2019 11:50 PM News
ఏపీపీఎస్సీ పై కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫైర్

ఏపీపీఎస్సీ చేసే తప్పులకు బలి అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వమే న్యాయ సాయం అందించాలని నిరుద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు న్యాయ పోరాటం చేసేందుకు, తాము కోరుకున్న న్యాయవాదులతో న్యాయ సాయం పొందేందుకు సహాయం అందించేందుకు, అందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు ప్రభుత్వం, ఏపీపీఎస్సీ తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీపీఎస్సీ చేస్తున్న పలు తప్పులకు పేద అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. కాలెండర్ ఇయర్ ప్రకారం నోటిఫికేషన్ లు విడుదల చేయాలని, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఏ ఒక్క అభ్యర్థి అన్యాయానికి గురికాకూడదని, ఒక అభ్యర్థికి అన్యాయం జరిగితే కుటుంబ మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందరికీ భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: