జియో బాదుడు షురూ, ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే 6 పైసలు చెల్లించాల్సిందే

Thursday, October 24, 2019 03:15 PM News
జియో బాదుడు షురూ, ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే 6 పైసలు చెల్లించాల్సిందే

టెలికం సంస్థ రిలయన్స్‌ జియో చార్జీల వడ్డన షురూ చేసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది.కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఆ ప్రకటనలో వివరించింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌–అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్‌ అప్‌ వోచర్స్‌ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది.  

జియో యూజర్లు ఇతర జియో ఫోన్లకు, ల్యాండ్‌లైన్లకు చేసే కాల్స్‌కు, వాట్సప్, ఫేస్‌టైమ్‌ తదితర యాప్స్‌ ద్వారా చేసే కాల్స్‌కు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. కాగా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉచితంగానే కొనసాగుతాయని జియో పేర్కొంది. 

కొత్త ఐయూసీ ప్లాన్లు 
ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ కోసం జియో కొత్తగా నాలుగు ఐయూసీ ప్లాన్స్‌ను(టాప్‌ అప్స్‌) ప్రవేశపెట్టింది. ప్లాన్స్‌కి సరిపడా డేటా ఉచితంగా ఇస్తున్నందున ఈ ఏడాది డిసెంబర్‌ 31 దాకా యూజర్లపై నికరంగా అదనపు భారం ఉండబోదని జియో తెలిపింది. ఇక పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు కూడా అఫ్‌–నెట్‌వర్క్‌ కాల్స్‌పై నిమిషానికి  6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది. కొత్త ఐయూసీ ప్లాన్లు..

రూ. 10 ప్లాన్‌
124 నిమిషాలు. 1 జీబీ డేటా.
రూ. 20 ప్లాన్‌
249 నిమిషాలు. 2 జీబీ డేటా.
రూ. 50 ప్లాన్‌
656 నిమిషాలు. 5 జీబీ డేటా.
రూ. 100 ప్లాన్‌
 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా.
 

For All Tech Queries Please Click Here..!