బ్రేకింగ్: ఒక్కొక్కరికి రూ. 2 వేలు.. ఇప్పుడే ప్రకటించిన సీఎం జగన్

Wednesday, April 15, 2020 05:28 PM News
బ్రేకింగ్: ఒక్కొక్కరికి రూ. 2 వేలు.. ఇప్పుడే ప్రకటించిన సీఎం జగన్

రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు చేసిన కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న చికిత్స సహా ఇతర అంశాలపై సీఎం జగన్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు తెలిపారు.అలాగే వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని తెలిపారు. ఇక క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం జగన్‌ మరోసారి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఎలాంటి ఆటకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి బాధితుడికి రోజూ భోజనం, వసతి లాంటి అవసరాల కోసం రూ. 500కు తక్కువ కాకుండా కేటాయించాలని అధికారులకు సూచించారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం రంగంపై కూడా సీఎం ఆరా తీశారు. అరటి, పుచ్చ ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులను ఆదుకోవడానికి త్వరితగతిన చేపట్టాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని తెలిపారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: