ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Wednesday, May 20, 2020 12:26 PM News
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తమిళనాడు లోని కోయింబెడు మార్కెట్ మూలాలు ఎక్కువగా బయటపడుతున్నాయని  ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 68 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా గత 24 గంటల్లో కొత్తగా 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్‌ కాగా, కరోనాతో ఇవాళ కర్నూలు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 715 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: