కరోనాపై సాగిస్తున్న పోరులో ఇదో పెద్ద సవాల్.

Wednesday, May 20, 2020 12:19 PM News
కరోనాపై సాగిస్తున్న పోరులో ఇదో పెద్ద సవాల్.

ప్రస్తుతం కరోనాపై మనం సాగిస్తున్న పోరులో ఇదో పెద్ద సవాలుగా మారింది. వైరస్‌ శరీరంలో ప్రవేశించినా ఎటువంటి లక్షణాలు లేని వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే చాలామందికి వైరస్‌ వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆదివారం చైనాలో 17 కొత్త కేసులు నమోదైతే అందులో 12 కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు.

ఇప్పుడీ లక్షణాలు కనబరచని రోగులతోనే పెద్ద సమస్య. వీరిలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండడం కూడా ఈ లక్షణాలు బయడపడకపోవడానికి ఒక కారణం అయిఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు. వీరి నుంచి ఇన్‌ఫెక్షన్‌ చెయిన్‌ను తెంచాలంటే ఎంత ఎక్కువ మందికి అయితే అంత మందికి పరీక్షలు చేయడం అత్యుత్తమ మార్గం అని జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీ(అమెరికా)కు  చెందిన సీనియర్‌ పరిశోధకుడు, ఇమ్యునాలజిస్ట్‌ గిగి గ్రాన్‌వాల్‌ తెలిపారు.

వసతులు లేకుంటే లక్షణాలతో సంబంధం లేకుండా అందరూ మాస్క్‌లు, భౌతిక దూరం పాటించడం మేలని అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. మన దేశంలోనూ ఇలాంటి లక్షణాలు లేని కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ ‌(ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: