ఆంధ్రప్రదేశ్ స్కూల్‌లో దారుణం, పిల్లలతో క్షుద్ర పూజలు.

Tuesday, February 4, 2020 08:30 AM News
ఆంధ్రప్రదేశ్ స్కూల్‌లో దారుణం, పిల్లలతో క్షుద్ర పూజలు.

ఆంధ్రప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలోఉపాధ్యాయుడు విద్యార్థులతోనే క్షుద్రపూజలకు చేయించాడు. ఓ విద్యార్థినికి చెవి కమ్మలు పోయాయన్న కారణంతో క్షుద్రపూజలు చేయించాడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. విద్యార్థిని చెవికమ్మలు పోయిన విషయం ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తెలిసింది. దీంతో మంత్రగాడిని పిలిపించి అంజనం వేయిస్తే దొంగ దొరుకుతాడని, ఆదివారం తలస్నానం చేసి స్కూలుకు రావాలని విద్యార్థులకు చెప్పాడు. అప్పటికే అక్కడ మంత్రగాడు రమణతో ఉపాధ్యాయుడు రవికుమార్ సిద్ధంగా ఉన్నాడు. విద్యార్థుల చేతి గోళ్లపై పసరు రాసి మంత్రం పఠిస్తున్న సమయంలో ఓ విద్యార్థి తాత స్కూలుకు వచ్చాడు.

దీంతో అక్కడ  జరుగుతున్న తతంగాన్ని చూశాడు. పిల్లలతో ఏం చేయిస్తున్నారని ప్రశ్నించడంతో వాళ్లిద్దరు కంగారుపడ్డారు. విషయం తెలిసిన గ్రామస్థులు స్కూలుకు రావడంతో మంత్రగాడు రమణ అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో ఉపాధ్యాయుడు నిర్వాకంపై ఆగ్రహించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్‌కు వచ్చిన పోలీసులు ఉపాధ్యాయుడును అదుపులోకి తీసుకున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: