మరో 19 రోజులు లాక్ డౌన్ పొడగింపు

Tuesday, April 14, 2020 10:28 AM News
మరో 19 రోజులు లాక్ డౌన్ పొడగింపు

లాక్‌డౌన్ సడలింపులపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు పొడిగింపుకే ఓటెయ్యగా ప్రధాని మోదీ మాత్రం తన నిర్ణయంని వెళ్లడించారు. తొలిదశ లాక్‌డౌన్ గడువు ఏప్రిల్ 14న ముగియనుండడంతో.. ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో లాక్ డౌన్ ని మరో 19 రోజులు అంటే మే 3 వరకు పెంచటం జరిగింది అని మోడీ అన్నారు.

కరోనా పైన యుద్ధంలో చాలా దేశాలకంటే మనం బాగా ముందువనున్నామని, ఇది మీ అందరి సహకారం వల్లనే జరిగిందని అన్నారు. ఇదే స్పూర్తితో మరో 19 రోజులు లాక్ డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కావలిసిన ధాన్యం , మందులు అన్ని సరిపడా ఉన్నాయని ఎవరు భయపడవద్దని చెప్పారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి అందరిని ఆదుకుంటామని మోడీ చెప్పారు 

For All Tech Queries Please Click Here..!
Topics: