దేశంలో కరోనా విజృంభణ: ఒక్క రోజే 8వేల కేసులు

Saturday, May 30, 2020 10:18 AM News
దేశంలో కరోనా విజృంభణ: ఒక్క రోజే 8వేల కేసులు

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం అందరికి ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7964 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కి చేరింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,971 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 86,422 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా కోరల్లో చిక్కుకున్న టాప్ 5 రాష్ట్రాలు.

మహారాష్ట్ర :62,228

తమిళనాడు : 20,246

ఢిల్లీ :17,386

గుజరాత్: 15,974

రాజస్థాన్ :8,365

తెలుగు రాష్ట్రాలలో కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్: 3,330

తెలంగాణ: 2,425

For All Tech Queries Please Click Here..!
Topics: