కరోనా బ్రేకింగ్: రికార్డు తిరగరాసిన భారత్, అత్యధిక కేసులు నమోదు.

Sunday, May 24, 2020 07:14 AM News
కరోనా బ్రేకింగ్: రికార్డు తిరగరాసిన భారత్, అత్యధిక కేసులు నమోదు.

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,663 కొత్త కేసులు నమోదయ్యాయని , 142 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,31,423 ఉండగా 73,162 మంది చికిత్స పొందుతున్నారు. కాగా మరణాల సంఖ్య 3,868 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇచ్చామని వివరించారు.

కరోనా కోరల్లో చిక్కుకున్న టాప్ 5 రాష్ట్రాలు.

మహారాష్ట్ర :47,190

తమిళనాడు : 15,512

గుజరాత్: 13,669

ఢిల్లీ :12,910

రాజస్థాన్ :6,742.

తెలుగు రాష్ట్రాలలో కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్: 2,714

తెలంగాణ: 1,813

For All Tech Queries Please Click Here..!
Topics: