కరోనా బ్రేకింగ్: 24 గంటల్లో 5,547 కొత్త కేసులు, 132 మంది మృతి

Thursday, May 21, 2020 07:18 AM News
కరోనా బ్రేకింగ్: 24 గంటల్లో 5,547 కొత్త కేసులు, 132 మంది మృతి

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5547 కొత్త కేసులు నమోదయ్యాయని , 132  మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,028 కాగా మరణాల సంఖ్య 3,434 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

కరోనా కోరల్లో చిక్కుకున్న టాప్ 5 రాష్ట్రాలు.

మహారాష్ట్ర :39,297

తమిళనాడు : 13,1919

గుజరాత్: 12,539

ఢిల్లీ :11,088

రాజస్థాన్ :6,015.

తెలుగు రాష్ట్రాలలో కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్: 2,560

తెలంగాణ: 1,661

For All Tech Queries Please Click Here..!
Topics: