ఏపీలో గత 24 గంటల్లో 45 కరోనా పాజిటివ్‌ కేసులు

Thursday, May 21, 2020 01:57 PM News
ఏపీలో గత 24 గంటల్లో 45 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు కొత్తగా 45 మందికి కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు.

కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1680కి చేరింది. కరోనాతో ఇవాళ  నెల్లూరు నుంచి ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 54కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 718 కరోనా యాక్టివ్‌ కేసులుఉన్నాయని ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది.

For All Tech Queries Please Click Here..!
Topics: