ఒకేసారి 21 కొత్త కేసులు, ఏపీలో 132కు చేరిన కరోనా పాజిటివ్. ఆ రెండు జిల్లాలే అధికం.

Thursday, April 2, 2020 11:47 AM News
ఒకేసారి 21 కొత్త కేసులు, ఏపీలో 132కు చేరిన కరోనా పాజిటివ్. ఆ రెండు జిల్లాలే అధికం.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత రెండు రోజుల్లో 37 కేసులు నమోదు కాగా, గత 12 గంటల వ్యవధిలో కొత్తగా 21 పాజిటివ్ కేసులు తేలాయి. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 21 కేసులు వెలుగు చూసినట్లు నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన అధికారికంగా విడుదల చేశారు. రెండు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరో నాలుగు జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో నెల్లూరు మరియు గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభులుతుంది. ఈ రెండు జిల్లాల్లో కొన్ని గంటల వ్యవధిలో 40 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గుర్తించవచ్చు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ కేసు నమోదైన నెల్లూరు జిల్లాలో 12 గంటల వ్యవధిలోనే 20 కేసులు నమోదు అయ్యాయి. తొలి పాజిటివ్ కేసు నమోదైన తరువాత మళ్లీ ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోవడం ఇదే తొలిసారి. గుంటూరు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి

For All Tech Queries Please Click Here..!
Topics: