బెంగళూరు లో వాయుసేన విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి

Saturday, February 2, 2019 10:10 AM News
బెంగళూరు లో వాయుసేన విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిరాజ్ 2000 విమానం బెంగుళూరు (HAL) లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ట్రెయినీ పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) విమానాశ్రయం వద్ద శుక్రవారం (ఫిబ్రవరి 1) ఉదయం టేక్ ఆఫ్ జరిగే టైం లో ఈ ప్రమాదం జరిగింది. విమానం కుప్పకూలగానే సహాయ సిబ్బంది వారిని విమాన శకలాల నించి బయటకి తీశారు. ఘటనా స్థలిలోనే ఒక పైలట్ మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ కన్ను మూశాడు. 

విమానం టేకాఫ్ తీసుకునే స‌మయంలో ఈ ప్రమాదం జరగడం విషాదం. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో టేకాఫ్ సమయంలో విమానం స‌రిహ‌ద్దు గోడ‌ను ఢీకొంది. అనంతరం మంటల్లో కాలిపోతూ.. కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన పైలట్లు ఇద్దరూ విమానం నుంచి ఏజెక్ట్ అయ్యారు. మృతి చెందిన శిక్షణా పైలట్లను నేగి, అబ్రోల్‌గా అధికారులు గుర్తించారు. 

For All Tech Queries Please Click Here..!