ఏపీలో 143కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: జిల్లాల వారీగా వివరాలు.

Friday, April 3, 2020 06:39 AM News
ఏపీలో 143కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: జిల్లాల వారీగా వివరాలు.

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు రోజుల ముందు వరకు పదులు సంఖ్యలోనే ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా వంద దాటిపోయాయి. దీంతో ఏపీ ప్రజల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. గురువారం ఒక్క రోజే మొత్తం 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఉదయం బులెటిన్లో 21, మధ్యాహ్నం బులెటిన్లో 3, సాయంత్రం బులెటిన్లో 8 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 23 మందికి కరోనా సోకగా. నెల్లూరులో 21, గుంటూరులో 20, ప్రకాశంలో 17, కడపలో 16, పశ్చిమగోదావరిలో 14, విశాఖపట్నంలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: