నా భార్య దానికి పనికిరాకుండా చేస్తోంది.

Friday, May 26, 2023 11:33 PM Lifestyle
నా భార్య  దానికి పనికిరాకుండా చేస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని రఘురాజ్ కుష్వాహా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. స్థానిక జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు రఘురాజ్ అతని భార్య మీద ఫిర్యాదు చేశాడు, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న భార్యతో హ్యాపీగా జీవితం గడపాలని భర్త అనుకున్నాడు. అయితే భార్య ఆమె బాయ్ ఫ్రెండ్స్ ను నేరుగా ఇంటికే పిలిపించుకుని రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. క్లైమాక్స్ లో భర్త నా భార్య నాది కొరికేసిందని, నన్ను చంపేయాలని ప్రయత్నించిందని, వేరే అమ్మాయితో తాను ఆ పనికి పనికిరాకుండా చేస్తోందని కేసు పెట్టడం కలకలం రేపింది.

రఘురాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం లక్ష్మి రాజకుమారి అలియాస్ రాజకుమారి అనే యువతిని రఘురాజ్ పెళ్లాడాను. వివాహం చేసుకున్న తరువాత రాజకుమారి ఆమె భర్త రఘురాజ్ తో కొంతకాలం చాలా సంతోషంగానే ఉంది. తరువాత లక్ష్మీ రాజకుమారి మేడమ్ అసలు సినిమా మొదలు పెట్టడంతో ఆమె భర్త రఘురాజ్ కు చుక్కలు కనపడ్డాయి.

పెళ్ల అయిన కొంతకాలం తరువాత రఘురాజ్ కు అతని భార్య లక్ష్మీ రాజకుమారి ప్రవర్తనపై అనుమానం పెరిగిపోయింది. లక్ష్మీ రాజకుమారి ప్రతిరోజూ ఎవరినో ఒకరిని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడేది. మొదట ఇంటికి వచ్చిన యువకులను లక్ష్మీ రాజకుమారి నా బంధువులు అంటూ భర్త రఘురాజ్ కు, అత్తమామలకు చెప్పేది. నిత్యం కొత్త ముఖాలు ఇంటికి వస్తుండంటంతో భార్య లక్ష్మీ రాజకుమారి బంధువులే అని ఆమె భర్త రఘురాజ్ అనుకున్నాడు.

ప్రతిరోజు ఇంట్లోకి రోజూ అపరిచితులు రావడం, వెళ్లడం మొదలెట్టడంతో రఘురాజ్ కు అనుమానం వచ్చింది. తనకు తెలియని వ్యక్తులు ఇంట్లోకి రావడం, పదేపదే బయటకు రావడం సరికాదని, నువ్వు పద్దతి మార్చుకోవాలని రఘురాజ్ అతని భార్య లక్ష్మీ రాజకుమారికి వార్నింగ్ ఇచ్చాడు. రఘురాజ్ అతని భార్య లక్ష్మీ రాజకుమారికి పలుమార్లు హెచ్చరించినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

నన్ను పదేపదే బెదిరిస్తే నీతో పాటు నీ కుటుంబ సభ్యులపై వరకట్నంవేదిపుల కేసు పెడుతానని, తప్పుడు కేసులో ఇరికిస్తామని లక్ష్మీ రాజకుమారి ఆమె భర్త రఘురాజ్ ను బెదిరింపులకు గురి చేసిందని తెలిసింది. ఇటీవల తన భార్య తన తండ్రి కల్యాణ్ సింగ్ మీద పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి ఆయన్ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి పరవు తీసిందని రఘురాజ్ ఆరోపిస్తున్నాడు.

తన తండ్రి కల్యాణ్ సింగ్ మీద పోలీసులకు ఎందుకు తప్పుడు ఫిర్యాదు చేశావు అని తన భార్య లక్ష్మీ రాజకుయారిని నిలదీసి నాలుగుదెబ్బలు వేశానని రఘురాజ్ జిల్లా ఎస్పీకి చెప్పాడు. ఆ సమయంలో నా మీద దాడి చేస్తావా అంటూ సహనం కోల్పోయిన తన భార్య లక్ష్మీ రాజకుమారి తన మర్మాంగం కొరికేసిందని రఘురాజ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

తనను తన కుటుంబ సభ్యులు గ్వాలియర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని, కోలుకున్న తరువాత తాను తన భార్య రాజకుమారి మీద కేసు పెట్టానని రఘురాజ్ అంటున్నాడు. రాజకుమారికి పలువురితో అక్రమ సంబంధం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. రఘురాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజకుమారి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!