బిగ్ బాస్ షోలో మాజీ టీడీపీ మంత్రి కూతురు..?

Friday, August 2, 2019 12:06 PM Entertainment
బిగ్ బాస్ షోలో మాజీ టీడీపీ మంత్రి కూతురు..?

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగులో సీసన్ 3 మొదలయింది, నాగార్జున హోస్ట్‌గా 15మంది సెల‌బ్రిటీల‌తో జూన్ 21న సీసన్ 3 ఘనంగా మొదలయ్యి విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండ‌ర్ అయిన త‌మ‌న్నా సింహాద్రి బిగ్ బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించారు. అయితే త‌మ‌న్నా సింహాద్రి ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమెకు సంబంధించిన చాలా విషయాలు మనకి తెలియవు. ఆమె కుటుంబానికి రాజకీయ నేపద్యం ఉంది. 

వివరాలలోకి వెళితే ఆమె అసలు పేరు సింహాద్రి మ‌స్తాన్‌, మ‌స్తాన్‌ అని ఉన్నా వాళ్లు హిందువులే. సింహాద్రి సత్యనారాయణ గతంలో అవ‌నిగ‌డ్డ నుంచి గెలిచి టీడీపీ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆయనకు ఎంతో నిజాయ‌తీ ప‌రుడన్న మంచి పేరుకూడా ఉంది. త‌మ‌న్నాకు ఆయ‌న పెద‌నాన్న అవుతారు. స‌త్య‌నారాయ‌ణ‌కు త‌మ‌న్నా కూతురు వ‌రుస అవుతుంది. ఇక త‌మ‌న్నా తండ్రి రైతు, పల్లెటూరిలో మ‌గ‌వాడిగా ఉండ‌డం ఇష్టంలేక ఇళ్లు వ‌దిలి హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది. ఇటీవ‌ల జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి మంగ‌ళ‌గిరిలో పోటీ చేయాలని ట్రై చేసింది. చివరకు మంగళగిరిలో లోకేష్ మీద ఇండిపెండెంట్‌గా పోటీకి దిగింది. ఆమెది కృష్ణా జిల్లా లోని అవనిగడ్డ ప్రాంతం అందుకే మంగళగిరిలో పోటీ చేసింది. చివ‌ర‌కు ఆమెకు వ‌చ్చిన ఓట్లు మాత్రం 45 మాత్రమే.

For All Tech Queries Please Click Here..!
Topics: