వర్మను బాగా బాధించిన సంఘటన ఇదే
Saturday, January 18, 2020 02:00 PM Entertainment
వివాదాస్పద అంశాలను ఆధారంగా చేసుకొని దానికి తనదైన ఫిక్షన్ జోడించి ఆసక్తికరమైన సినిమాలు తీయడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు. నిత్యం సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే ఆయన ఏది చేసినా అది సంచలనమవుతూ ఉంటుంది.
తాజాగా ఆయన తన ట్విటర్ అకౌంట్లో ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దిశ హత్యాచారాన్ని మరువక ముందే ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న భయానక సంఘటనను గురించి తెలుసుకుని తన హృదయం ద్రవించిందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇటువంటి వాటికి కఠినమైన సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన చేసిన ఈ ట్వీట్కు సమాధానంగా ఆర్జీవీ సున్నితమైన అంశాలను కూడా అర్థం చేసుకోగలడు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
For All Tech Queries Please Click Here..!