ఏముంది ఆ ఫోటోలో? నెటిజన్లపై నిత్యామీనన్ ఫైర్..

Thursday, August 15, 2019 08:49 AM Entertainment
ఏముంది ఆ ఫోటోలో? నెటిజన్లపై నిత్యామీనన్ ఫైర్..

అందాల భామ నిత్యామీనన్ కేవలం తన నటనతోనే తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అద్భుతంగా హావభావాలు పలికించగల నటి అని పలు ప్రశంసలు అందుకుంది. ఇక నిత్యామీనన్ తన కెరీర్ లో ఎప్పుడూ గ్లామర్ రోల్స్ చేసి హద్దులు దాటి అందాల ఆరబోత చేయలేదు. ఇక వివరాల లోకి వెళితే నిత్యామీనన్ నటిస్తున్న తాజా చిత్రం మిషన్ మంగళ్, జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ కీలక పాత్రలో నటిస్తోంది. సోనాక్షి సిన్హా, తాప్సి, విద్యాబాలన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో నిత్యామీనన్ చిత్ర యూనిట్ తో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. .

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్ సినిమాలోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలపై నెటిజన్లువిమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు నిత్యామీనన్ సొంత రాష్ట్రం కేరళలో వరదలు పోటెత్తుతున్నాయి. అంతా జలమయం కావడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఫోటో షూట్స్, సినిమా ప్రమోషన్స్ తో ఎంజాయ్ చేస్తున్నావు అంటూ విరుచుకుపడుతున్నారు. దీనిపై నిత్యామీనన్ ఘాటుగా స్పందించింది. బుద్ధిలేని వాళ్ళు మాత్రమే అలా మాట్లాడుతారు అని బదులిచ్చింది. సినిమా ప్రారంభం అయ్యాక ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం నావిధి. ప్రస్తుత పరిస్థితి గురించి నాకు తెలుసు. మేమంతా కలసి వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చాం. దీని గురించి మీకు తెలియక సినిమా ప్రమోషన్స్ లో సంతోషంగా గడుపుతోంది అని తప్పుగా అనుకుంటున్నారు. అది సరైనది కాదు అని నిత్యా మీనన్ సోషల్ మీడియా లో జవాబిచ్చారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: