శరత్‌కుమార్‌ అరెస్టు చేయండి: హైకోర్టు

Monday, May 6, 2019 10:29 AM Entertainment
శరత్‌కుమార్‌ అరెస్టు చేయండి: హైకోర్టు

ప్రముఖ నటులు శరత్‌కుమార్‌ మరియు రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్‌ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది.

For All Tech Queries Please Click Here..!