దిశా హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో మంచు మనోజ్.

Friday, December 6, 2019 11:33 AM Entertainment
దిశా హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో మంచు మనోజ్.

దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం (6th డిసెంబర్ 2019) తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేయటం సంచలనంగా మారింది. ఎక్కడైతే దిశా పైన ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్‌ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా' అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

ఈ ఘటనపై టాలీవుడ్‌ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ కూడా స్పందించారు. ఈ రోజున దిశకు అసలైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: