టీవీ రిమోట్‌తోనే తండ్రిని చంపేసింది, దేశంలో తొలి వింత హత్య ఇదేనట

Thursday, September 26, 2019 05:24 PM Crime
టీవీ రిమోట్‌తోనే తండ్రిని చంపేసింది, దేశంలో తొలి వింత హత్య ఇదేనట

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఢిపరెంట్ హత్య జరిగింది. కేవలం టీవీ రిమోట్ తోనే ఓ కూతురు తన తండ్రిని చంపేసింది. వినడానికి ఇది చోద్యంగా ఉన్న నిజంగానే బ్రిటన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..యూకేలోని బ్రిస్టల్‌కు చెందిన Nicola Townsend (50) తన తండ్రి టెరెన్సే(78)తో కలిసి జీవిస్తోంది. అయితే ఓ రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ వాగ్వాదంలో కోపాన్ని అణుచుకోలేకపోయిన నికోలా.. తండ్రి మీదకి టీవీ రిమోట్ విసిరింది. అనూహ్యంగా ఆ రిమోట్ తండ్రి తలని బలంగా తాకింది. దీంతో అతడు గింగరాలు తిరుగుతూ కిందపడ్డాడు. అలా కింద పడటం వల్ల పక్కటెములు విరిగాయి. ఆ తర్వాత శ్వాసనాళ సంబంధ నిమోనియా(Bronchopneumonia)తో చనిపోయాడు. 12 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన టెరెన్సే చివరికి ప్రాణాలు విడిచాడు.

రిమోట్ తలకు తగలడం వల్ల అతడికి తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నికోలాని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నికోలా బెయిల్‌ మీద బయటకు వచ్చింది. ఈ ఘటనపై కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. కాగా ఈ కేసును కోర్టు ప్రత్యేకంగా పరిగణిస్తోంది. బ్రిటన్ చరిత్రలో టీవీ రిమోట్‌ను ఆయుధంగా ఉపయోగించి హత్య చేసిన తొలి మహిళగా నికోలాను గుర్తించింది. ఇది ఇలా ఉంటే ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు అనుకోకుండా జరిగిన ఈ హత్యపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా కత్తులతో పొడిచి చంపుతారు, లేదా పదునైన ఆయుధంతో అదీ కాదంటే రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ.. తేలికపాటి రిమోట్‌తో కూడా ప్రాణాలు తీయొచ్చని ఇప్పుడే తెలిసింది అంటు కామెంట్లు పెడుతున్నారు.  

For All Tech Queries Please Click Here..!